లాభాలతో ముగిసిన మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబై, నవంబర్ 1, (way2newstv.com)
దేశీ స్టాక్ మార్కెట్ మళ్లీ పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు శుక్రవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. మీడియా, మెటల్ రంగ షేర్లు పరుగులు పెట్టడం మార్కెట్‌కు కలిసొచ్చింది. సెన్సెక్స్ 36 పాయింట్ల లాభంతో 40,165 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11,890 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. గత ఆరు సెషన్లలో సెన్సెక్స్ 2.9 శాతం, నిఫ్టీ 2.65 శాతం పరుగులు పెట్టాయి.
✺ నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఏకంగా 18 శాతానికి పైగా పెరిగింది.
లాభాలతో ముగిసిన మార్కెట్లు

✺ అదేసమయంలో యస్ బ్యాంక్, ఐఓసీ, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టా్ల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ 6 శాతానికి పైగా పడిపోయింది.
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ మీడియా ఏకంగా 8 శాతం పరుగులు పెట్టింది. నిఫ్టీ మెటల్ కూడా 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.20 శాతం పెరుగుదలతో 59.77 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.50 శాతం పెరుగుదలతో 54.45 డాలర్లకు ఎగసింది.
..✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి స్వల్ప లాభాల్లో ట్రేడవుతోంది. 9 పైసలు పెరుగుదలతో 70.84 వద్ద కదలాడుతోంది.