ఏపీలో బుల్ బుల్ టెన్షన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో బుల్ బుల్ టెన్షన్

విశాఖపట్టణం, నవంబర్ 7  (way2newstv.com)
ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు.. నెలల తరబడి వరదతో ఇబ్బందులెదుర్కొంటున్న ఏపీపై మరో పిడుగు పడింది. మరో తుఫాను విరుచుకుపడనుంది. బంగాళాశాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కడలి కల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిశను మార్చుకుని ఆగ్నేయంగా కొనసాగుతూ తీవ్రవాయుగుండంగా మారింది. అది ఏపీలోని బందరుకు 390 కిలోమీటర్లు.. పారదీప్‌కు 810 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు 920 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది.
ఏపీలో బుల్ బుల్ టెన్షన్

 తీవ్రవాయుగుండం రానున్న 24 గంటల్లో తుఫానుగా, ఈ నెల 9వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ తీవ్ర తుఫాన్‌కు బుల్‌బుల్‌గా నామకరణం చేశారు. ఆగ్నేయ దిశగా ఒడిశా -పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రభావంతో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సుముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.తాజాగా బుల్‌బుల్ తుఫాన్‌ రూపంలో ఏపీ ప్రభుత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పుడు బుల్‌బుల్ తుఫాన్ పుణ్యమాని మరికొన్ని రోజులు ఇసుక తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే ప్రధాన నదుల్లో వరదల కారణంగా ఇసుక తీయలేకపోతున్నామని.. మరో వారం రోజుల్లో వరదలు తగ్గుతాయని.. అనంతరం ఇసుక పూర్తి స్థాయిలో సరఫరా చేసి ఇబ్బందులు తొలగిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో తుఫాన్ కాస్త ఇబ్బందికరంగానే మారింది