మెట్రోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెట్రోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నవంబర్ 29  (way2newstv.com)
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్సిటీ -రాయదుర్గం మెట్రో మార్గాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు.
మెట్రోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు. కారిడార్ -3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా మరో 1.5 కి.మీ. మార్గం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.