మరింత తగ్గిన బంగారం ధరలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరింత తగ్గిన బంగారం ధరలు

హైద్రాబాద్, నవంబర్ 5 (way2newstv.com)
గత 5 రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈ రోజు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.40,370కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.37,010కు క్షీణించింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం అక్కడే స్థిరంగా కొనసాగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,750 వద్దనే నిలకడగా ఉందిఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. 
 మరింత తగ్గిన బంగారం ధరలు

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,000కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.37,800కు పడిపోయింది.బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.48,750 వద్దనే ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1,509.25 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం క్షీణతతో 18.02 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.