బంగారం ధర పైపైకి.. వెండి జిగేల్! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బంగారం ధర పైపైకి.. వెండి జిగేల్!

ముంబై, డిసెంబర్ 18 (way2newstv.com)
పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.90 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.36,250కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 పరుగులు పెట్టింది. దీంతో 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,600కు చేరింది. ఇక బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.100 పెరుగుదలతో రూ.46,800కు చేరింది. 
బంగారం ధర పైపైకి.. వెండి జిగేల్!

ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 1,480.50 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. ఔన్స్‌ 17.06 డాలర్ల వద్ద నిలకడగా కొనసాగుతోంది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గురువారం రోజున నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1490 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 20 శాతం పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య ఉద్రిక్తతలకు బ్రేకులు పడ్డాయి. ఇరు దేశాల మధ్య తొలి విడత ఒప్పందం కుదిరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఇకపోతే అదేసమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే.