ఆరోగ్యశ్రీకి జీవం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆరోగ్యశ్రీకి జీవం

గుంటూరు, డిసెంబర్ 23, (way2newstv.com)
పైసా ఖర్చు లేకుండా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు కార్పొరేట్‌ వైద్యం అందించడం కోసం  ఆరోగ్యశ్రీకి జీవం పోశారు. ఇతర రాష్ట్రాల్లో సైతం పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందే సౌకర్యాన్ని కల్పించారు. అయితే దేవుడు కరుణించినా.. పూజారి వరం ఇవ్వలేదన్న చందంగా.. ప్రభుత్వ లక్ష్యానికి కొన్ని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి.  ఆరోశ్రీ అర్హత ఉన్న జబ్బులకు సైతం ఉచిత వైద్యం చేయకుండా చుక్కలు చూపిస్తున్నాయి. అత్యవసరాన్ని బట్టి ఆయా జబ్బులకు వైద్యం అందించి డబ్బులు వసూలు చేస్తున్నాయి.   
ఆరోగ్యశ్రీకి జీవం

ఇటీవల మెదడులో రక్తం గడ్డకట్టి చికిత్స నిమిత్తం మంగళరిలోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఓ మహిళ చేరింది. సదరు మెదడు సంబంధిత జబ్బుఆరోగ్య శ్రీ కిందకు వస్తుంది. అయితే ఆస్పత్రి యాజమాన్యం ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పింది. దీంతో రోగి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండటంతో వైద్యం చేయించుకున్నారు. రోగి బంధువులు మరుసటి రోజు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌ను సంప్రదించగా మెదడు సంబంధిత జబ్బుకు ఆరోగ్య శ్రీ వర్తిసుందని, ఆస్పత్రికి ఫోన్‌ చేసి ఆరోగ్యశ్రీ పథకం కిందకు కేసును బదలాయించాలని సూచించారు. అయితే కేసును ఆరోగ్యశ్రీ కిందకు బదలాయించకుండా ఫీజు రూ.4 లక్షలు కట్టాల్సిం    దేనని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ పథకంలో ఉన్న కొన్ని రకాల జబ్బులకు మాత్రమే చికిత్స అందిస్తోంది. అవీ అధిక మొత్తంలో నిధులు వచ్చే కేసులను మాత్రమే అడ్మిట్‌ చేసుకుంటోంది. తక్కువ మొత్తంలో ఆరోగ్య శ్రీ ప్యాకేజీ ఉండే కేసులను నిరాకరిస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కో–ఆర్డీనేటర్‌కు ఫిర్యాదులు అందాయి.