ఏపీలో మరో కొత్త పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో మరో కొత్త పథకం

గుంటూరు, డిసెంబర్2(way2newstv.com):
ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు.. గుంటూరు జీజీహెచ్‌లో పథకం ప్రారంభించిన జగన్.. ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఆరోగ్య శ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం అన్నారు జగన్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పనిచేస్తున్నామని.. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు అందజేస్తామన్నారు.రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తించేలా కొత్త పథకం అమలు చేస్తామని.. రెండు వేల రోగాలకు ఆరోగ్యశ్రీ విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
ఏపీలో మరో కొత్త పథకం

1200 వ్యాధుల్ని ఆరోగ్య శ్రీ కిందకు తీసుకొచ్చామని.. పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా 2వేల వ్యాధులకు చికిత్స అందిస్తామన్నారు. ఆ తర్వాత నెలకు ఒక జిల్లా చొప్పున రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు. ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తున్నామని.. డిసెంబర్ 15నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 510 మందులు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖల మారుస్తాం అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రలుకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.ఇక గత కొద్ది రోజులుగా తన మతం, కులంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా తన మతం మానవత్వం.. తన కులం మాట నిలబెట్టుకొనే కులం అంటూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఎవరేమన్నా పట్టించుకోనని.. ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నామన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా అందరికి మంచి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అన్నారు.ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి.. డిసెంబర్‌ 1 నుంచి రోజుకు రూ. 225, లేని పక్షంలో నెలకు రూ. 5 వేల ఆర్థిక సాయం అందిస్తారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లోనే నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లో జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏడాదికి రూ. 268.13 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.