టిఫిన్ – ట్యూషన్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టిఫిన్ – ట్యూషన్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట డిసెంబర్ 03,  (way2newstv.com)
సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాల లో సత్య సాయి ట్రస్ట్ వారి సహకారం తో టిఫిన్ - ట్యూషన్ , వొడా ఫోన్ వారి సౌజన్యం తో విద్యార్థులకు ఎనిమియా పరీక్షల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్ని  ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ  ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ సాయంత్రం టిఫిన్ - ట్యూషన్ కార్యక్రమం వుంటుంది.  పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట రాష్ట్పంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలి.  దిశా పై జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని అన్నారు.  తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి. మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్య అందించాలి.  
టిఫిన్ – ట్యూషన్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

తల్లిదండ్రులు ఆడపిల్లలపై కన్నా మగ పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.  మగ పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయంపై నిరంతరం పర్యవేక్షించాలి.  సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల్లో రెండు కొత్త కార్యక్రమాలు రూపోందించామని అన్నారు.  30 లక్షల రూపాయలతో 413 స్కూల్స్ 68 వేల మంది విద్యార్థులకు అనీమియా టెస్ట్ 11 మిషన్లు వొడాఫోన్ వాళ్ళు 6 నుండి 12 వ తరగతి వాళ్ళు అనీమియా ఉన్న వాళ్ళను గుర్తించి వారికి ఉచిత మందులు, చికిత్స అందజేయటం జరుగుతుంది.  అనీమియా తో బాధ పడుతున్న వారిని గుర్తించి వారి తల్లితండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నివారణ చర్యల పైన అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు.  పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు తీసుకురావాలి , అత్యధిక స్ట్రెంత్ ఉన్న స్కూల్ మనది 10/10 రావాలి ఆటల్లో 30 మంది స్టేట్ లెవల్ , నేషనల్ స్థాయికి వెళ్ళటం జరిగింది..పది ఫలితాల్లో కూడా ముందుండాలి.  యోగ నేర్చుకొని అమ్మ నాన్నలకు సైతం నేర్పించాలి, మంచి మార్కులు రావాలన్న, మంచి ఆలోచన రావాలన్న యోగ అవసరమని అన్నారు.  టిఫిన్ అండ్ ట్యూషన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అల్పాహారం తో పాటు ట్యూషన్ కూడా చెప్పండి , హోమ్ వర్క్ చేపించి పిల్లల బంగారు భవితకు పునదులు వేయాలి.  అడపిల్లలతో పాటు అబ్బాయిలను కూడా సామాజిక స్పృహ కల్పించాలి , సమాజం అటు వైపు కూడా ఆలోచించాలి.  ప్రభుత్వ బాలికల పాఠశాల అభివృద్ధి 25 లక్షలు మంజూరు చేస్తున్నాం.. పెయింటింగ్ , కిచెన్ , గ్రౌండ్ పునరుద్ధరణ కోసం నిధుల కేటాయించామని మంత్రి వెల్లడించారు.