బంగారం ధరలు తగ్గుతున్నాయ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బంగారం ధరలు తగ్గుతున్నాయ్

ముంబై, డిసెంబర్ 14 (way2newstv.com)
పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,190కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.180 పడిపోయింది. దీంతో ధర రూ.35,910కు తగ్గింది. ఇకపోతే బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.46,700కు చేరింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరిస్థితి ఇలానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గుదలతో రూ.37,850కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 తగ్గింది. 
బంగారం ధరలు తగ్గుతున్నాయ్

దీంతో ధర రూ.36,650కు క్షీణించింది. పసిడి తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. ధర కేజీకి రూ.50 పెరుగుదలతో రూ.46,700కు చేరింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.54 శాతం పెరుగుదలతో 1,480.20 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.30 శాతం పెరుగుదలతో 17.00 డాలర్లకు ఎగసింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌లో గురువారం రోజున నెల గరిష్ట స్థాయికి తాకింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్ని అస్థిర పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర ఔన్స్‌కు 1490 డాలర్లకు ఎగసింది. ఇది పసిడికి నెల గరిష్ట స్థాయి.