రెండు వారాలుగా పెరుగుతున్న బంగారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రెండు వారాలుగా పెరుగుతున్న బంగారం

ముంబై, డిసెంబర్ 30, (way2newstv.com)
పసిడి పరుగు కొనసాగుతోంది. బంగారం ధర పైకి కదులుతూనే వస్తోంది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ పసిడి ధర మళ్లీ కొండెక్కుతోంది. దేశీయంగా కూడా డిమాండ్ పుంజుకోవడంతో ధర గత 2 వారాలుగా పెరుగుతూనే వస్తోంది. తాజాగా సోమవారం కూడా బంగారం ధర పరుగులు పెట్టింది.హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం కూడా బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈసారి రూ.200 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.37,300కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.240 పెరుగుదలతో రూ.40,690కు ఎగసింది.బంగారం ధర గత రెండు వారాలుగా పరుగులు పెడుతూనే వస్తోంది. ఈ కాలంలో పసిడి ధర 10 గ్రాములకు రూ.1,300కు పైగానే పెరిగింది. డిసెంబర్ 11న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.35,910 వద్ద ఉంది. 
రెండు వారాలుగా పెరుగుతున్న బంగారం

అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.39,170 వద్ద ఉంది. పండుగ సీజన్ ముంగిట, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ధర పెరగడం కస్టమర్లకు ప్రతికూల అంశమని చెప్పుకోవచ్చు.బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా మరింత పైకి కదిలింది. కేజీ వెండి ధర ఎక్కుగానే పెరిగింది. రూ.250 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,350కు చేరింది. వెండి ధర పెరగడం ఇది వరుసగా ఐదో రోజు కావడం గమనార్హం.అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో పసిడి ధర క్రమంగా పెరుగుతూ వస్తోందన్నారు. అంతేకాకుండా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక గణాంకాల నేపథ్యంలో మాంద్యం భయాలు మళ్లీ మొదలుకావచ్చనే అంచనాలు పసిడి ధరపై ప్రభావం చూపాయి. అలాగే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో అవి ఎప్పుడైనా పడిపోవచ్చనే ఆందోళనలు కూడా పసిడి పరుగుకు దోహపడుతున్నాయి.ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.38,100కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరుగుదలతో రూ.39,300కు ఎగసింది. కేజీ వెండి ధర కూడా రూ.250 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.49,350కు చేరింది.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కూడా పెరిగింది. ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 1,517 డాలర్ల పైకి చేరింది. ఇది 7 వారాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌‌కు 0.27 శాతం పెరుగుదలతో 17.88 డాలర్లకు చేరింది.ఇకపోతే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర సెప్టెంబర్ నెలల్లో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు కారణం. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర కింది స్థాయిల్లోనే కదలాడుతోంది.మరోవైపు దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఈ ఏడాది దాదాపు 22 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణం.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.