ఘనంగా నాగోబా జాతర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఘనంగా నాగోబా జాతర

అదిలాబాద్ జనవరి 31  (way2newstv.com)
ఆదివాసీల అతిపెద్ద జాతరలలో ఒకటైన కేస్లాపూర్ శ్రీ నాగోబా జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.   జాతరకు వచ్చి నాగోభాను దర్శించుకునే భక్తులతో కేస్లాపూర్ జనసంద్రంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, చేత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్  తదితర రాష్ట్రాల నుండి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మేస్రం వంశీయుల ఆరాధ్యదైవమైన నాగోబా జాతర వేడుకల సందర్భంగా బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్ కు రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిదిగా వచ్చారు. అయనతో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు,  ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్,  ఎస్పీ విష్ణు వారియర్, కేస్లాపూర్ సర్పంచ్ రేనూక, జడ్పీటీసీ  పుష్పలత, ఐటీడీఏ చైర్మన్ లక్కీ రావు, పివో ఆదిత్యతో పాటు మేస్రం వంశస్తులు వెంకట్రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. 
ఘనంగా నాగోబా జాతర

జాతరకు వచ్చిన మంత్రికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. తమ సాంప్రదాయాలలో భాగంగా తలపాగా చుట్టి నాగోబా దేవత దర్శనానికి తీసుకెళ్లారు. అటు నాగదేవతను దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మేస్రం వంశస్తులతో మాట్లాడారు. అటు జాతర సందర్భంగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే దర్బార్ లో అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసిల సంస్కృతి, సాంప్రదాయాలను చాటే విధంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.అనంతరం అదివాసిలనుద్దేశించి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ  నాగోబా దేవాలయం నిర్మాణానికి కావాల్సిన నిధులన్నీ ఇస్తానన్నారు. ఇప్పటికే 50 కోట్లు ఇచ్చామని, రానున్న రోజుల్లో మరో 50 కోట్ల కోసం ముఖ్యమంత్రి  కెసిఆర్ కు విన్నవిస్తామని హామీ ఇచ్చారు.  రాజగోపురాలు, గ్రైనేట్, ఆర్చిల నిర్మాణాలతో వెయ్యి సంవత్సరాలు నిలిసిపోయెల ఈ అలయాన్ని నిర్మిస్తామన్నారు. ఆదివాసీల పోడు భూముల జోలికి అతవి శక అధికారులు వెళ్ళారని, పోడుభూములకు హక్కుపత్రాలు తప్పకుండా ఇస్తాని చెప్పారు. అటవీశాఖ అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని, అడవులు అంతరించిపోతే మానవమనుగడనే ప్రశానర్దాకంగా మరుతోందన్నారు.అంతకుముందు ఎంపీ సోయంబాపు రావ్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు ఆదివాసిలను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఆదివాసీల మీద కేసులు పెడితే ఊరుకోమని, మేము తిరగబడితే ఉద్యోగులు డ్యూటీలు చేయడం కష్టంగా మారుతోందని హెచ్చరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలన్నారు. నాగోబా అబివృద్దికి కేస్లాపూర్ లో ఇప్పటికే 11 కోట్లతో వివిధ అబివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. అటు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గోండి భాషాలో మాట్లడుతూ అడివసిలను ఆకట్టుకొన్నారు. అదిలాబాదుకు బదిలీఫై ఇక్కడికి రావడానికి ఏడుస్తూ వచ్చామని.. ఇప్పుడు మళ్లీ ఇక్కడి నుండి వెళ్లాలంటే మరింత ఏడుపు వస్తోందని అన్నారు. ఆదివాసీలతో మమేకమై మూడు సంవత్సరాలుగా ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఆదివాసులు తమ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుతు బావిత్రాలకు అందిచేడం చరిత్రలో నిలిసిపోలేల ఉందన్నారు. ముఖ్యంగా చదువు ఫై దృషి సారించాలని చెప్పారు,ఇదిలాఉంటే ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ 2018 నుండి ఇప్పటి వరకు మూడు సార్లు నాగోబా జాతరను నిర్వహించడం జరిగిందని గుర్తు చేసారు.  దీనికి ఆ నాగదేవత దివ్య ఆశీస్సుకే కారణమన్నారు. ఆదివాసీలు ఎప్పుడైనా తమ సమస్యలను విన్నవించేందుకు తమ వద్దకు రావచ్చని సూచించారు.        ప్రదనంగా ఆదివాసి పిల్లలను చదివించి ఉద్యోగం చేసేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు..