కరెంట్ చార్జీల పెంపునకు సిద్ధం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కరెంట్ చార్జీల పెంపునకు సిద్ధం

విజయవాడ, జనవరి 8 (way2newstv.com)
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈ నెల 9, 10, 11న బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఏపీఎస్పీడీసీఎల్‌  సిద్ధమయ్యింది. ఈ మేరకు సీఎండీ ప్రకటన చేశారు.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నట్లు తెలిపారువిజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఈ నెల 9న.. కడప జెడ్పీ సమావేశ మందిరంలో 10న, తిరుపతి ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో 11న ప్రజాభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. 
కరెంట్ చార్జీల పెంపునకు సిద్ధం

ఈ మూడు రోజుల్లో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. దీంతో విద్యుత్ ఛార్జీల పెరుగుతాయ అనే అనుమానాలు మొదలయ్యాయి.జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం ఛార్జీల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. గత టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు.. మరి వైఎస్సార్‌‌సీపీ కూడా అదే బాటలో నడుస్తుందా లేదా అన్నది చూడాలి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.44,840.86కోట్లు అవసరమవుతాయని ఏఆర్‌ఆర్‌లో డిస్కంలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితి, 2020-21లో సమకూర్చుకోగలిగే రాబడి, నిర్వహణకు అయ్యే వ్యయం, ఏర్పడే లోటుపై డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో పొందుపరిచాయి.