మళ్లీ కొండెక్కి కూర్చుంటున్న బంగారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ కొండెక్కి కూర్చుంటున్న బంగారం

ముంబై, జనవరి 27 (way2newstv.com)
పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధర పెరుగుతూ వస్తోంది. మళ్లీ కొండెక్కి కూర్చుంది. పసిడి ధర గత మూడు రోజులుగా పెరుగుతూనే వస్తోంది. దీంతో ఇప్పుడు బంగారం కొనాలని ప్లాన్ చేసే వారికి ఇది ప్రతికూల అంశమనే చెప్పొచ్చు. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పెరగడం సహా దేశీ మార్కెట్‌లో జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి బలహీనంగా ఉండటం కూడా పసిడి ధర పెరుగుదలకు దోహదపడిందని తెలిపారు. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం పెరిగింది. 
మళ్లీ కొండెక్కి కూర్చుంటున్న బంగారం

రూ.430 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.41,660 నుంచి రూ.42,090 చేరింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో రూ.38,190 నుంచి రూ.38,620కు చేరింది.బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి రూ.140 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,060 నుంచి రూ.49,200కు పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఉండటం ఇందుకు కారణం.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38,620కు చేరింది. వెండి ధర కూడా రూ.49,200కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.71 శాతం పెరుగుదలతో 1583.10 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.61 శాతం పెరుగుదలతో 18.22 డాలర్లకు ఎగసింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పైకి కదిలింది. దీంతో ధర రూ.39,450కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.40,650కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.140 పెరుగుదలతో రూ.49,200కు చేరింది.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.