ప్రైవేట్‌ రంగంలో యువతకు ఉపాధి కల్పన: మంత్రి కేటీఆర్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రైవేట్‌ రంగంలో యువతకు ఉపాధి కల్పన: మంత్రి కేటీఆర్‌

మేడ్చల్‌ జనవరి 6 (way2newstv.com)
యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పనపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇంజనీరింగ్‌ విద్యలో వస్తున్న మార్పులపై మేడ్చల్‌లోని అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా, సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పెట్టుబడులు, ఉపాధి కల్పించే 14 రంగాలను గుర్తించినుట్లు మంత్రి తెలిపారు. 
ప్రైవేట్‌ రంగంలో యువతకు ఉపాధి కల్పన: మంత్రి కేటీఆర్‌

నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంచి ఇన్‌స్టిట్యూట్‌ అంటే పెద్ద పెద్ద భవనాలు ఉండడం కాదనీ.. కళాశాలలో అత్యున్నతమైన ప్రొఫెసర్లు ఉండడమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యార్థుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం టాస్క్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. టాస్క్‌తో కలిసి పనిచేసేందుకు ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ముందుకు రావాలని మంత్రి సూచించారు.2020ని తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ ఏడాదిగా ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి గుర్తు చేశారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి ఉద్యోగావకాశాలు మెరుగు పరుస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌, గ్రోత్‌లను తాను బలంగా నమ్ముతానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఐటీ ఇండస్ట్రీ, పరిశ్రమలను తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ సదస్సులో మంత్రులు కేటీఆర్‌, సబితా రెడ్డితో పాటు, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, 150 దేశాల ఇంజనీరింగ్‌ విద్య నిపుణులు పాల్గొన్నారు.