ముందే చెప్పిన బ్రహ్మం గారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముందే చెప్పిన బ్రహ్మం గారు

విజయవాడ, జనవరి 31 (way2newstv.com)
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న వైరస్ ఇది. పాముల నుంచి ఈ వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న వైద్య నిపుణులు.. దీన్ని తొలిసారిగా చైనాలో గుర్తించారు. దీని ప్రభావంతో ఆ దేశంలో ఇప్పటికే 132 మంది మృత్యువాతపడ్డారు. అయితే.. వైరస్ గురించి కొత్త విషయం ప్రజల నోళ్లల్లో నానుతోంది. అదే.. కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారని. కాలజ్ఞానంలో 114వ పద్యం.. కోరంకి అనే జబ్బు గురించి ఉంది. 
ముందే చెప్పిన బ్రహ్మం గారు

అది భారత దేశానికి ఈశాన్య దిక్కున ఉన్న దేశంలో పుడుతుందని రాశారు. అంటే.. భారత్‌కు ఈశాన్య దిక్కున ఉన్నది చైనాయే. కోరంకి జబ్జుతోకోటి మంది దాకా మృతిచెందుతారని తెలిపారు. ఆ కోరంకి.. కరోనా అయితే కోటి మంది దాకా మృతిచెందుతారట. దీంతో ఆ పద్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పద్యం ఏంటంటే..
కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి
కోడిలాగ తూగిసచ్చేరయ ||శివ|| 114
ఇదిలా ఉండగా, కరోనా ఆనవాళ్లు ఇండియాలో ఇప్పటి వరకు కనిపించకపోయినా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వస్తున్న అందర్నీ ఎయిర్ పోర్టుల్లో క్షుణ్నంగా చెక్ చేస్తోంది. పలు ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలు కూడా ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించి గాంధీ ఆస్పత్రిలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని కేంద్ర వైద్య బృందం కూడా పరిశీలించింది