మానవత్వంతో కూడిన వైద్యులు కావాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మానవత్వంతో కూడిన వైద్యులు కావాలి

హైదరాబాద్  జనవరి 08 (way2newstv.com)
భౌరంపేట్ చైతవ్య కళాశాల క్యాంపస్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు బుధవారం సందర్శించారు. అక్కడున్న విద్యార్ధులతో మాట్లాడారు. మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా, ఆత్మవిశ్వాసం అవసరం. విద్యార్థులు తమ లక్ష్యాలను ఆత్మవిశ్వాసం తో సాధించాలి. గతంలోఎంసెట్ ఉండేది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో నీట్ గా మార్చారు. నీట్ పరీక్ష లలో మీరంతా మంచి ర్యాంకులు సాధించాలని అన్నారు. మంచి క్యాంపస్లో చదువుతున్నారు.  
మానవత్వంతో కూడిన వైద్యులు కావాలి

తప్పకుండా మీరంతా డాక్టర్లు అవుతారు. నేను మీకు చెప్పేది ఒక్కటే. సమాజం కేవలం వైద్యులను కోరుకోవడం లేదు. మానవత్వంతో కూడిన వైద్యులు కావాలని అన్నారు. సమాజంలోఎక్కువ గౌరవం పొందే వ్యక్తి డాక్టర్లే. మానవత్వంతో వైద్యం చేయకపోతే గౌరవం ఉండదు. మీరు డాక్చర్లు అయ్యాక పేదవాళ్లను మరిచిపోవద్దు. డబ్బు హోదా ,సిరి సంపదలు ఇవ్వలేని సంతృప్తి,  పేదలకు సాయం చేయజం వల్ల కలుగుతుంది. ఈ క్యాంపస్ లోఉన్న 400 మంది మానవత్వంతో కూడిన వైద్యులు కావాలని ఆకాంక్షిస్తున్నాని మంత్రి అన్నారు.