గురువారం ఉదయం నుంచి ప్రారంభం
12న 11 గంటలకు బడ్జెట్
అదే రోజు వ్యవసాయ బడ్జెట్ కూడా
అమరావతి, జూలై 10, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు 14 రోజులపాటు (పనిదినాలు) జరగనున్నాయి. ఈరోజు అమరావతిలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
పద్నాలుగు రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి ప్రారంభంకానున్న సమావేశాలు సెలవులతో కలిసి ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసన సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అదేరోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ను సభ ముందుంచనున్నారు. సమావేశానికి ముఖ్యమంత్రి జగన్ తో పాటు టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు.