చిక్కుల్లో సోమిరెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిక్కుల్లో సోమిరెడ్డి

నెల్లూరు, ఆగస్టు 28 (way2newstv.com)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి భూమిని విక్రయించినట్లు ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమిరెడ్డితో పాటూ మరో ముగ్గుర్ని ఈ కేసులో నిందితులుగా చేర్చారు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసులు. వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 58-3లో 2.40 ఎకరాల భూమి ఉందట. ఈ భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని.. తర్వా ఆ భూమిని మరొకరికి అమ్మేసినట్లు ఫిర్యాదు అందింది. 
చిక్కుల్లో సోమిరెడ్డి

అక్రమంగా ప్రభుత్వ భూమిని అమ్ముకున్నారని.. సోమిరెడ్డిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని రంగారెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. ఈ భూముల వ్యవహారం కోర్టుకు చేరడంతో.. సోమిరెడ్డిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో చంద్రమోహన్‌రెడ్డితో పాటూ పొలాలను కొనుగోలు చేసిన మేఘనాథన్‌, జయంతి, సర్వేయర్‌ సుబ్బరాయుడిపైనా ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఈ కేసు వ్యవహారంపై సోమిరెడ్డి స్పందించలేదు. ఆయన లాయర్లతో చర్చించి న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.