15 పాయింట్లు కోతతో....కోహ్లీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

15 పాయింట్లు కోతతో....కోహ్లీ

ముంబై ,ఆగస్టు 14, (way2newstv.com)
ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో పేలవ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టెస్టు నెం.1 ర్యాంక్‌ను చేజార్చుకున్నాడు. వారం క్రితం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టు.. రెండు ఇన్నింగ్స్‌ల్లో 149, 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి అగ్రస్థానానికి ఎగబాకిన విషయం తెలిసిందే. అయితే.. లార్డ్స్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి పేలవంగా 23, 17 పరుగులే చేయడంతో అతని ఖాతాలో 15 పాయింట్లు కోత పడింది. దీంతో.. మళ్లీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ 929 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు. తొలి టెస్టుకి ముందు కోహ్లి ఖాతాలో 903 పాయింట్లు ఉండగా.. ఒక శతకం, అర్ధశతకం బాదడంతో.. 30 పాయింట్లు పెరిగి 934తో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే.. తాజాగా అతని ఖాతాలో 15 పాయింట్లు కోత పడటంతో.. ప్రస్తుతం కోహ్లి 919 పాయింట్లతో నిలిచాడు. బాల్ టాంపరింగ్ కారణంగా.. స్టీవ్‌స్మిత్‌పై ఏడాది నిషేధం ఉండటంతో విరాట్ కోహ్లీ మళ్లీ టాప్ ర్యాంక్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. 2011, జూన్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని దక్కించుకోగా.. ఆ తర్వాత ఆ ఘనత అందుకున్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. 



15 పాయింట్లు కోతతో....కోహ్లీ