మహేష్‌బాబుకు జీఎస్టీ అధికారులు షాక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహేష్‌బాబుకు జీఎస్టీ అధికారులు షాక్

హైద్రాబాద్, ఫిబ్రవరి 20 (way2newstv.com): 
సూపర్‌ స్టార్ మహేష్‌బాబుకు జీఎస్టీ అధికారులు మరోసారి భారీ షాకిచ్చారు. మహేష్‌బాబుకు చెందిన 7 స్కీన్ల సూపర్‌ప్లెక్స్‌ ఏఎంబీ థియేటర్‌లో పాత జీఎస్టీ రేట్లకే టికెట్లు విక్రయించడంతో కేసు నమోదు చేశారు. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. జీఎస్టీ తగ్గించినా.. పాత జీఎస్టీ రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అక్రమంగా రూ.30లక్షలు వసూలు చేశారు. ఏఎంబీ థియేటర్‌పై కేసు నమోదు చేసిన జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ట్యాక్స్‌ చెల్లించకపోవడంతో మహేష్‌బాబుకు చెందిన రెండు బ్యాంక్‌ అకౌంట్లను అధికారులు సీజ్‌ చేశారు. ఇప్పటికే మహేష్‌పై 2007-08 నాటి సర్వీస్‌ ట్యాక్స్‌ వివాదంపై కోర్టులో విచారణ జరుగుతోంది. 


మహేష్‌బాబుకు జీఎస్టీ అధికారులు షాక్

ఏసియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్‌బాబు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ పేరిట హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అధునాతన సాంకేతిక హంగులతో ప్రతిష్టాత్మకంగా మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. అయితే ఏఎంబీ సినిమాస్‌కు సంబంధించి ఓ వార్త  ఉదయం నుంచి విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలను ఏఎంబీ సినిమాస్ అమలు చేయడం లేదని, దీన్ని గుర్తించిన అధికారులు మహేష్‌బాబుకు షోకాజ్ నోటీసులు పంపారని వార్తలు వచ్చాయి. దీంతో మహేష్‌బాబును ట్విట్టర్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వివాదంపై ఏసియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ స్పందించారు. ఏఎంబీ సినిమాస్‌కు షోకాజ్ నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాము కొత్త జీఎస్టీ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారులు మల్టీప్లెక్స్‌కు వచ్చిన మాట నిజమేనని, వారు రికార్డులు పరిశీలించారని తెలిపారు. తాము జీఎస్టీ తగ్గించే టికెట్‌లు విక్రయిస్తున్నామని, దీంతో అధికారులు వెనుదిరిగారని చెప్పారు. పెనాల్టీ కట్టాలని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు. నోటీసులు ఇచ్చారని వెబ్‌సైట్లలో వచ్చిన వార్తల గురించి తెలుసుకుని జీఎస్టీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు. ఏఎంబీ సినిమాస్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయదని, వినియోగదారులకు అధునాతన అనుభూతిని కల్పించడంతో పాటు వారికి సరసమైన ధరలకే వినోదాన్ని అందించడం ఏసియన్ సినిమాస్ ధ్యేయమని చెప్పారు.