ఘనంగా ప్రారంభమైన ఆర్గానిక్ ఫెస్ట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఘనంగా ప్రారంభమైన ఆర్గానిక్ ఫెస్ట్

హైద్రాబాద్, ఫిబ్రవరి 6 (way2newstv.com)
శిల్పారామంలో విమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మహిళా నేత గుండు సుధారాణి, అక్కినేని అమల, మంచు లక్ష్మీ పాల్గొన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆర్గానిక్ ఫెస్టివల్ కొనసాగనుంది. 


ఘనంగా ప్రారంభమైన ఆర్గానిక్ ఫెస్ట్

ఈ సందర్భంగా మహముద్ అలీ మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్గానిక్ ఆహారం చాలా అవసరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్గానిక్ సేద్యం పెంచే దిశగా కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రైతులకు మంచి పథకాలు అమలు చేశామన్నారు. 2018-19లో రైతుల కోసం రూ. 12 వేల కోట్లు కేటాయించామని తెలిపారు