మోహన్ బాబుతో ఐశ్వర్యరాయ్ జోడి


హైద్రాబాద్, మే 18(way2newstv.com):
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు లేటు వయసులో గోల్డెన్ ఛాన్స్ కొట్టారు. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌తో జోడీ కట్టబోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తాజాగా త‌మిళ ర‌చ‌యిత కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ న‌వల ఆధారంగా ఒక మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ కథలో మోహన్ బాబు కీలకపాత్రలో నటించబోతున్నారు. 



మోహన్ బాబుతో ఐశ్వర్యరాయ్ జోడి

ఆయనకు భార్యగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాలీవుడ్ సుందరి ఐశ్వర్యరాయ్.. నందిని పాత్రలో కనిపింబోతుందట. ఇటీవల దర్శకుడు మణిరత్నం.. ఐశ్వర్యరాయ్‌కి కథ వినిపించడంతో ఆమె ఓకే చేసినట్టు తెలుస్తోంది. రాజ్యాధికారం మీద మక్కువతో ద్రోహానికి పాల్పడే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు మంచి స్కోప్ ఉండటంతో మోహన్ బాబు పక్కన ఆయనకు భార్యగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఐశ్వర్య రాయ్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఐశ్వర్యరాయ్‌‌లతో పాటు జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Previous Post Next Post