విజయవాడ, జూలై 9 (way2newstv.com)
గవర్నర్ నరసింహన్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విజయవాడ గేట్ వే హోటల్లో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. గవర్నర్తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై జగన్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్, ఏపీకి కేటాయింపులపైనా ఇద్దరి మధ్య ప్రస్తావన వచ్చిందట. అలాగే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలపైనా చర్చలు జరిగాయట.
గవర్నర్ తో జగన్ భేటీ
ఆస్తుల పంపకాలు, ఇరిగేషన్కు సంబంధించిన అంశాలపైనా చర్చించారట. ఈ నెల 11 (గురువారం) నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల కోసం గవర్నర్ మంగళవారం ఉదయమే విజయవాడకు చేరుకున్నారు. ఈ నెల 12న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్కు సంబంధించిన కసరత్తు మొత్తం పూర్తయ్యింది.