ఇవేం ఉద్యోగాలు..? (విశాఖ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇవేం ఉద్యోగాలు..? (విశాఖ)

విశాఖపట్నం, జూలై 12 (way2newstv.com): 
ప్రభుత్వ పాఠశాలల్లోని ఆర్ట్, వర్క్, వృత్తి విద్య పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్ల పరిస్థితి (పీటీఐ) దయనీయంగా ఉంది. పేరుకు పార్ట్‌ టైం అయినా వారంతా ఫుల్‌ టైం పనిచేయాల్సి వస్తోంది. కేవలం మధ్యాహ్న వేళల్లో సహపాఠ్య కార్యక్రమాలు బోధన చేయించాలని వీరిని నియమించగా వీరు రోజంతా పని చేయాల్సి వస్తోంది. పాఠశాలల్లోని హెచ్‌ఎంల ఆదేశాలుతో వీరు పని చేయక తప్పడంలేదు. అరకొర జీతం..ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేయాలంటే తాము ఎలా బతకాలని ఇన్‌స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం–2009లో భాగంగా 6,7,8 తరగతుల విద్యార్థులకు సృజనాత్మకత, పనిపట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్, వర్క్, వృత్తి విద్య బోధించడానికి పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు (పీటీఐ)ను సర్వశిక్ష అభియాన్, రాజీవ్‌ విద్యా మిషన్‌ నియమించాయి. 
ఇవేం ఉద్యోగాలు..? (విశాఖ)

2012లో ఈ నియామకాలు జరిగాయి. పీటీఐల నియామక సమయంలో పార్ట్‌ టైం విధానం అయినా పూర్తికాలం పని చేయించారు. ఈ పార్ట్‌ టైం బోధకులతో కేవలం మధ్యాహ్న వేళల్లో మాత్రమే ఒక్క పూట బోధన చేయించాలని గతంలో ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో మరే ఇతర పనులకు గాని,  పాఠశాలలో ఇతర సబ్జెక్టుల బోధనకు గాని వినియోగించరాదని జీవోలో స్పష్టంగా సూచించారు. కేవలం పీటీఐలను సహపాఠ్యాంశాల బోధనకు మాత్రమే వినియోగించాలని ఆదేశాలిచ్చారు. కానీ అది అమలు మాత్రం జరగడం లేదు. జిల్లా పరిషత్, జీవీఎంసీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పార్ట్‌టైం బోధకులను రోజంతా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఇన్‌స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి పలుమా ర్లు వీరు తమ గోడును వి ద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లా రు. 2014–15లో విద్యాశాఖా ఇచ్చిన ఉత్తర్వులను చూపించినా హెచ్‌ఎంలు పట్టించుకోవడంలేదు. పీటీఐలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తికాలం పనిచేయాలని ఆదేశిస్తూ మానసికంగా ఒత్తిడి తెస్తున్నారని ఇన్‌స్ట్రక్టర్లు ఆరోపిస్తున్నారు. అలా చేయని యడల రీఎంగెజ్‌మెంటుపైన, డ్యూటీ సర్టిఫికెట్లపై హెచ్‌ఎంలు సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి.జీవీఎంసీ పరిధిలో కొంత మంది హెచ్‌ఎంలు మరో అడుగు ముందుకేసి రెండుపూటలా పనిచేస్తేనే..లేకుంటే ఉండనవసరం లేదని బెదిరింపులకు దిగుతున్నారని ఇన్‌స్ట్రక్టర్లు ఆవేదన చెందుతున్నారు. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యపై ఆ యూనియన్‌ నాయకులు సంప్రదింపులు జరిపినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. సమస్య ఉన్న పాఠశాలల్లో యూనియన్‌ నాయకులు పలుమార్లు హెచ్‌ఎంను కలిసి చెప్పినా వారు వినిపించుకోవడంలేదు. ప్రాజెక్ట్‌ అధికారిని కలిసి చెబితా వారు నోటి మాట చెప్పి వదిలేస్తున్నారు. హెచ్‌ఎంలకు స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వడంలేదు. అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న పీటీఐలు మిగతా సమయంలో మరో చోట పనిచేసుకోవడానికి హెచ్‌ఎంలు అవకాశం ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.జిల్లాలో 480 మంది పార్ట్‌టైం బోధకులు ఉన్నారు. వీరంతా నెలకు రూ.14వేల వేతనంతో పనిచేస్తున్నారు. చాలీచాలనీ వేతనాలతో పీటీఐలు పని చేయాల్సి వస్తోంది. వీరిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ఉదయం వేళల్లో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేటు కార్యాలయాల్లో పనిచేస్తూ ఉండడం కనిపిస్తోంది.