విజయసాయికి షాక్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విజయసాయికి షాక్...


న్యూఢిల్లీ, జూలై 5, (way2newstv.com)
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. నియామకాన్ని రద్దు చేయడానికి కారణాలు మాత్రం జీవోలో పేర్కొనలేదు. లాభదాయక జోడు పదవులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం కావడంతో.. ప్రభుత్వం ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను తప్పించిందని భావిస్తున్నారు. విజయసాయి బదులు మరొకరికి ఈ పదవిలో నియమించే ఆలోచనలో ఉన్నారట ముఖ్యమంత్రి జగన్. ఈ రేసులో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోందట.వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు.. ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నా. 

విజయసాయికి షాక్...

వారిలో ఎవ‌రికీ ఈ ప‌ద‌విలో నియమించడానికి నిబంధనలు అడ్డుగా మారాయి. కాబట్టి మరో వ్యక్తిని ఈ పదవి కట్టబెట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీలో కాస్త పరిచయాలు ఉన్న వ్యక్తి అయితే ఈ ప్రత్యేక ప్రతినిధి పదవికి బావుంటుందనే సీఎం జగన్‌తో పాటూ వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. కొంతమంది నేతల పేర్లను కూడా పరిశీలించారట. వీరిలో గ‌తంలో ఎంపీగా ప‌ని చేసి అటు డిల్లీలో.. ఇటు రాష్ట్ర ప‌రిపాల‌న మీద అవ‌గాహ‌న ఉన్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణు గోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. ఈ పేరు ప్రధానంగా ప‌రిశీల‌న‌కు వ‌చ్చినట్లు తెలుస్తోంది. మోదుగుల అయితే ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టగల సమర్థత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. అందుకే వేణుగోపాల్‌రెడ్డి పేరు పరిశీలిస్తున్నారట. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  మోదుగుల సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా ఎంపీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తిరస్క‌ర‌ణ‌తో టీడీపీ ఎంపీ గెలిచారంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. టీడీపీ నుంచి 2009లో ఆయన నర్సరావుపేట నుంచి ఎంపీగా.. 2014లో గుంటూరు ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓడారు.