గుమ్మడికాయల దొంగ అంటే...భుజాలు తడుముకుంటున్నారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గుమ్మడికాయల దొంగ అంటే...భుజాలు తడుముకుంటున్నారు

రాజధాని రగడ పై అసలు కధ 
విజయవాడ ఆగష్టు 27 (way2newstv.com)
రాజధాని రైతుల ఆందోళనలో రైతులకంటే ఆ ప్రాతంల్లో భూములు కొనుగోలు  చేసి అడ్డదారిలో వేల  కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెత్తిన రాజకీయ నాయకులలోనే ఆందోళన అధికం గా వ్యక్తం అవుతున్నట్లు ఉంది.రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసి వ్యాఖ్యలుఫై రాదాంతం చేసి చివరికి రాజధాని రైతులలో ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు భూత అద్దంలో చూపించటం వెనుక అసలు రహస్యం దాగి వుంది. రాజధాని మార్పు జరుగుతుందని ఊహాగాన వార్తలు వెలువడిన వెంటనే రాజధాని ప్రాంతంలో రియల్ వ్యాపారం బాగా పడిపోయి,హైదరాబాద్లో 30శాతం పెరిగాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెలవు ఇచ్చిన వెంటనే రాజధాని రైతులు పేరిట కొంతమంది హైదరాబాద్ బాట బట్టడం ఎనుక పెద్ద కుట్ర దాగి ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
 గుమ్మడికాయల దొంగ అంటే...భుజాలు తడుముకుంటున్నారు

ఆదివారం హైదరాబాద్  కు వచ్చిన రైతులు కొంతమంది ఆంధ్రా నాయకులను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటీవల ఎన్నికలలో జనం చేతిలో ఘోర పరాజయం చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పదవి పోయిన వెంటనే తనపై నమోదు అయిన కేసులనుంచి బైటపటడానికి ఎన్నికలు అనంతరం భారతీయ జత పార్టీ లో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిలను కలవటంలో ఒక పెద్దాయన రాజకీయ చతురత కొట్టి వచ్చినట్లు కనబడుతోంది.రైతులకు సమస్యలు ఉంటె వాటిని పరిష్కరించాలని వారు తమ దగ్గరలో గల నేతలను కలుస్తారు.కానీ వ్యయ ప్రయాసలకు తట్టుకొని హైదరాబాద్ వెళ్లి ఈ ఇద్దరు ప్రముఖ నేతలను కలవటం వాలారు వారికి సంఘీభావం తెలపటం దానిని పచ్చ మీడియా రచ్చ చేయటం చూస్తుంటే "పిల్లి 
కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకంకి తెలియదులే అని భావించిన"  సామెత గుర్తుకు వస్తోంది.రాతుల్లకు అండగా పోరాడుతానని స్పష్టం చేసిన చంద్రబాబుమరి ఇప్పుడు ఈనెల 30,31 తేదీలలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెబుతున్న  జనసేన నేత పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలుపుతారో లేదో వేచిచూడాలి. ఇది ఇలావుంటే సుజనా చౌదరి రైతులను ఓదారుస్తూ రాజధాని తరలింపు వుండదని,ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముక్తాయించారు.రాజధాని రైతులు నేరుగా ముఖ్యమంత్రి ని కలవాలని ఆయన న్యాయం చేస్తారనిసెలవు ఇస్తూ రైతులకు భారతీయజనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.రాజధాని ప్రాతనంలో తనకు భూములు లేవని చెప్పుకొచ్చారు.ఈ ప్రాతంలో నాయుకులు పేరుమీద భూములు లేవు వాళ్ళ బినామీల పేరుమీద మాత్రం ఉన్నాయన్నది నగ్న సత్యం.అదేవిధంగా గుంటూరు లో తనను కలిసిన రైతులకు భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన రీతిలో భరోసా కల్పించారు.రాజధాని మార్పు అనివార్యమని ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు.మంత్రి బొత్స వ్యాఖ్యల తరువాత మాట్లాడిన రాష్ట్ర మంత్రులు కానీ,అధికారపార్టీ 
నాయుకులు కానీ అమరావతి మార్పు లేదని కుండ బద్దలు కొట్టారు.విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వచ్చిన తరువాత ఆయన ప్రకటన చేస్తే దానిపై ఎవరు ఉద్యమాలు చేసినా,దానిపై ప్రకటనలు చేసిన పరవాలేదు.కానీ ఏమి జరగక ముందే ప్రమాదం ముంచుకొచ్చినట్లు,రైతులకు అండగా మేమె ఉన్నట్లు ప్రసార మాధ్యమాల్లో చెవులకు చిల్లు పడేటట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు.ఇక్కడ  భూములు రేట్లు తగ్గిపోయి "దొనకొండ" ప్రాంతాల్లో ధరలు పెరిగిపోయాయని,హైదరాబాద్లో పెరిగిపోయాయని తెగ బాధ పది పోతున్నారు.అసలు వేలాది ఎకరాలు సేకరించి అమరవాతిని రాజధానిగా ఎంపిక చేయడం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచటానికా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.అమరావతిని రాజధానిని గా ఎంపీక చేసి నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు రుణాలు చేసి కనీసం ఒక్క భవనం కూడా ఈ  ఐదు సంవత్సరాలలో ఎందుకు కట్టలేదో అర్ధం కావటం లేదు.ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు,పరిశ్రమలు నెలకొల్పుతామని 100 నుంచి 500 ఎకరాలు వరకు చాలామంది ప్రభుత్వం నుంచి భూములు పొందారు. వారిలో ఒక్కరు కూడా ఇంతవరకూ తమ సంస్థలు ఎందుకు ప్రారంభించలేదు అన్న ప్రశ్నలకు మాజీ నేతలనుంచి సమాధానంలేదు.కేంద్రంనుచ్న్హి రాజధాని నిర్మాణానికి నిధులు అందలేదని చంద్రబాబు అమరావతిలో చెబితే దానిని జాతీయ మీడియాలో ప్రచారం చెస్ బాధ్యతను సుజనా చౌదరి నిర్వతించేవారు.అయితే ఆదివారం భారతీయ జనతా పార్టీ నేతగా హైదరాబాద్ లో సుజనా చేసిన ప్రకటన ఆయన రెండు నాల్కుల ధోరణికి అద్దం  పడుతొందిదేశంలో రాజధానిల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇవ్వదని,ప్రత్యేక ద్రుష్టి తో చూడటంతోనే రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని తాజాగా సెలవు ఇచ్చారు.చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉండగా మోడీ నిధులు ఇచ్చివుంటే అప్పట్లో బాబు సుజనా చేసిన ప్రకటను బూటకమని కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే మోడీని నిదించారని ప్రజలు భావించాల్సి ఉంది.ఇదే సందర్భంలో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ ప్రజలు తెలివైనవారు కాబట్టే తెలివైన తియిరుపును ఎన్నికలలో ఇచ్చారని అభిప్రాయపడ్డారు.ఇప్పుడు చేస్తున్న రాద్ధాంతాన్ని చూస్తుంటే ఒకవేళ ప్రభుత్వం రాజధాని మార్పు లో ఏవిధమైన మార్పు లేదని, ప్రకటిస్తే తాము ఉదయం చేస్తామంటేనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని పచ్చమీడియా ద్వారా ప్రచారం పొందవచ్చు.ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం మార్పు వైపు వెళితే రైతులు నష్ట పోయారు అని ప్రచారం చేసుకోవచ్చు అన్న ఆలోచన కాక మరొకటి కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఇక్కడ రైతులు భూములు పోగొట్టుకొని ఇప్పటికే నష్ట పోయారు. ఇప్పుడు రాజధాని మారిన, మారకపోయినా రైతులకు జరిగిన నష్టం జరిగిపోయింది.అందుకే గత ఎన్నికలలో రాజధాని ప్రాంతంలో గల తాటికొండ , మంగళగిరి నియోజకవర్గాలలో అప్పటి అధికార పార్టీ ఘోరంగా ఓడిపోయింది.కేవలం అధికార పార్టీ పై ఎదోవిధం గా బురద జల్లడానికి ప్రతిదీ రాజికీయంచేయటం ప్రచార కండూతి  మాత్రంమే నని పలువురు విమర్శిస్తున్నారు.