చిదంబరం అరెస్ట్ తో కేంద్ర ప్రభుత్వానికీ, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చిదంబరం అరెస్ట్ తో కేంద్ర ప్రభుత్వానికీ, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు

న్యూ డిల్లీ ఆగష్టు 22 (way2newstv.com) :
‘చట్టం తన పని తాను చూసుకుపోతుంది. చిదంబరం విషయంలో కోర్టులు తుది నిర్ణయం తీసుకుంటాయి. చిదంబరం అరెస్ట్ తో కేంద్ర ప్రభుత్వానికీ, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.. ఐఎన్ఎక్స్ మీడియాకు కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
చిదంబరం అరెస్ట్ తో కేంద్ర ప్రభుత్వానికీ, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు

ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పొందేందుకు చిదంబరం సహకరించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని సీబీఐ, ఈడీ కేసులు నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో చిదంబరం అరెస్ట్ పై స్పందించారు.ఈరోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. అవినీతిలో మునిగితేలినవారిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించాల్సింది కోర్టులే తప్ప ప్రభుత్వం కాదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.