ప్రతిభకు పట్టం అంటే ఇదేనా ! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రతిభకు పట్టం అంటే ఇదేనా !

టఫ్ పేపర్‌కు ఇన్ని మార్కులా?
ప్రభుత్వంపై రాకేష్ రెడ్డి ద్వజం.
పుత్తూరు  సెప్టెంబర్ 21 (way2newstv.com):
 ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ పరీక్షల్లో భారీ బాగోతంచాపకింద నీరులా సాగిపోయిందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అద్యక్షుడు రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశంలో ద్వజమెత్తారు.గురువారం ఫలితాలు ప్రకటించిన వెంటనే ఈ పరీక్షల్లో జరిగిన గూడుపుఠాణి బట్టబయలైందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం కేంద్రంగా జరిగిన కుట్ర రాష్ట్ర వ్యాప్తంగాపాకినట్లు తెలుస్తోందన్నారు. సర్వీసు కమిషన్ ఉద్యోగులు కొందరు ప్రశ్నపత్రం సంపాదించి తాము ప్రయోజనం పొందడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక మందికి ఈ పేపర్లు అందజేసిఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. 
ప్రతిభకు పట్టం అంటే ఇదేనా !

గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వహస్తాలతో విడుదల చేసిన ఫలితాల్లో కేటగిరి-1లోజి.అనితమ్మ(అనంతపురం) అనే యువతి టాప్ ర్యాంకర్‌గా నిలిచారని, ఏపీపీఎస్సీలో పరీక్షల వ్యవహారాలు చూసే కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ విధానంలో జూనియర్అసిస్టెంట్‌గా అనితమ్మ పనిచేస్తున్నారని తెలిపారు.  సచివాలయ పరీక్షల్లో అంతా పకడ్బందీగా చేశామని ముఖ్యమంత్రి, అధికారులు బల్లగుద్ది చెప్పినప్పటికీ లోలోపల చాలావ్యవహారాలు నడిచినట్లుగా ఈ ఫలితాలే చెబుతున్నాయన్నారు.గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షల్లో పారదర్శకంగా ప్రతిభకు పట్టం కట్టాలని తాము సూచిస్తున్న ప్పటికీ, పగడ్బందీగా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.జరిగిన తప్పిదాలను సరిదిద్దుకో కుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.