దిగొస్తున్న బంగారం ధర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిగొస్తున్న బంగారం ధర

ముంబై, సెప్టెంబర్ 7, (way2newstv.com)
పసిడి ధర దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.520 తగ్గుదలతో రూ.40,400కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.530 తగ్గుదలతో రూ.37,000కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి ధర మాత్రం పైకి పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,130 పెరుగుదలతో రూ.52,000కు చేరింది. 
దిగొస్తున్న బంగారం ధర

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ పెరగడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.38,960కు పడిపోయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.500 తగ్గుదలతో రూ.37,800కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర కూడా భారీగా పెరిగింది. రూ.1,130 పెరుగుదలతో రూ.52,000కు చేరింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.67 శాతం తగ్గుదలతో 1,515.30 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 2.88 శాతం తగ్గుదలతో 18.26 డాలర్లకు దిగొచ్చింది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.