ఆగస్టు 26న ప్రధాని మనసులో మాట కార్యక్రమం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆగస్టు 26న ప్రధాని మనసులో మాట కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్టు 24, (way2newstv.com)
భారత ప్రధాని  నరేంద్ర మోదీ తన మనసులోని మాటల్ని దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమం “మన్ కీ బాత్”, ఆగస్టు 26 (ఆదివారం) ఉదయం 11 గంటలకు  దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ఒకే సమయంలో ప్రసారం కానుంది. ఈ ప్రసారాన్ని ఆల్ ఇండియా రేడియో,   ఎఫ్.ఎమ్ గోల్డ్, ఉర్దూ సర్వీస్ మాధ్యమాల ద్వారా కూడా ఇదే సమయంలో వినవచ్చు. దూరదర్శన్ ఛానళ్ళు, డీ.డీ. నేషనల్, డీ.డీ. న్యూస్, డీ.డీ. భారతి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి.
 
 
 
ఆగస్టు 26న ప్రధాని మనసులో మాట కార్యక్రమం
 
ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ “మన్ కీ బాత్” ద్వారా ప్రసంగించిన వెంటనే, ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల ద్వారా “మన్ కీ బాత్”  తెలుగు అనువాదాన్ని ప్రసారం చేస్తుంది.  తిరిగి “మన్ కీ బాత్” తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల వివిధ భారతి, ఎఫ్.ఎమ్ రెయిన్ బో కేంద్రాలు ప్రసారం చేస్తాయని, ఎడి(పి) & ఆకాశవాణి ప్రోగ్రామ్ అధికారి వి. ఉదయ శంకర్ తెలిపారు.