అమరావతి (way2newstv.com)
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్, మౌలిక సదుపాయాల అబివృద్ది సంస్థ చైర్మన్ పదవికి బీజేపీ నేత ఆర్ లక్ష్మి పతి రాజీనామా చేసారు. మంగళవారంనాడు అయన అసెంబ్లీ లో సీఎం ని కలసి రాజీనామా లేఖ ను అందించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే నుండి టీడీపీ వైదొలగటం తో నేను కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేశానని అన్నారు. బీజేపీ నుండి టీడీపీ వైదొలిగినపుడు నేను బీజేపీ కి చెందిన వ్యక్తి గా పదవిలో ఉండటం భావ్యం కాదు. కేంద్రం ఎపి కి ఎమీ ఇచ్చిందో ప్రజల్లో కి వెళ్లి వివరిస్తాం. పవన్ జగన్ బిజెపి వెనుక ఉన్నారు అనేది అవాస్తమని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఛైర్మన్