ఫిబ్రవరి 20 (way2newstv.com):
బుధవారం నాడు మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర నేటి నుంచి నాలుగు రోజులపాటు కొనసాగనుంది.
మేడారం చిన్న జాతర ప్రారంభంములుగు
జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. జాతరకు మొత్తం 5 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు.