జగన్ ను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ...! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ ను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ...!

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (way2newstv.com)
హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ (లక్ష్మీప్రణతి తండ్రి) నార్నె శ్రీనివాసరావు వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలోని రాజకీయ అంశాలపై ఇరువురూ చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు, వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న తరుణంలో... ఈ భేటీ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. 



జగన్ ను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ మామ...!

అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని మీడియాతో మాట్లాడుతూ నార్నె తెలిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిశానని చెప్పారు. జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని... ఈ క్రమంలోనే ఆయనను కలిశానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీలోకి నార్నె శ్రీనివాసరావు చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ పార్టీలో అప్పుడు ఆయన చేరలేదు.