తెలంగాణ మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (way2newstv.com)
తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరు మహిళకు చోటు కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి  కేసీఆర్ శనివారం  ప్రకటించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ సీట్లలో కూడా కూడా ఓ మహిళకు స్థానం కల్పించినట్లు తెలిపారు. 


తెలంగాణ మంత్రిమండలిలో ఇద్దరు మహిళలకు చోటు

మంత్రివర్గం విస్తరణ పరిధి మనకున్నది 17. రాబోయే రోజుల్లో ఇంకా ఆరుగురిని తీసుకోనేది ఉంది. దాంట్లో ఇద్దరి మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. తాము మహిళలను నిర్లక్ష్యం చేయమని అయన అన్నారు. మహిళల పట్ల గౌరవం ఉందని అన్నారు. తెరాస కు  మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని అయన అన్నారు. మహిళలను నిర్లక్ష్యం చేయమని కేసీఆర్ స్పష్టం చేశారు.   తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పి వాటిని మహిళా సంఘాలకే అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.