మంచిర్యాల, మార్చి 09 (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రంలో లో రెండవ సారి టిఆర్ఎస్ పార్టీ కి అధికారాన్ని అందించిన ప్రజలకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసన సభ్యుడు దివాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియతో మాట్లాడారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మంత్రి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శం గా నిలిచాయి. సంక్షేమ రంగానికి 45 వేల కోట్ల రూపాయలను కేటాయించడం ఒక్క టిఆర్ఎస్ పార్టీ కె సాధ్యం అయ్యింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుంది. సంక్షేమ శాఖ మంత్రిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలని అన్నారు