అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ రద్దు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ రద్దు

హోం గార్డులకు మెరుగైన జీతాలు
చిరు వ్యాపారులకు.. ఐడీ కార్డులు. రూ.10 వేల వడ్డీ లేని రుణం 
అదోని సభలో  వైయస్ జగన్ వెల్లడి
అదోని, మార్చి 25 (way2newstv.com
ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో నష్టం కలిగిస్తున్న కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హమీనిచ్చారు. ఉద్యోగులు కోరుతున్నట్లుగా 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని, సకాలంలో వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని, సర్వీసు, విద్యార్హతల ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, ఔట్ సోర్సింగ్లో పని చేస్తున్న వారికీ న్యాయం చేస్తూ, సమానపనికి సమాన వేతనాలు చెల్లిస్తామని, పెన్షనర్ల కోసం ప్రతి జిల్లాలో ఒక సెల్ చేస్తామని జగన్ ప్రకటించారు. అదే విధంగా పోలీసు బాస్ లకు చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలు విప్పుతామని, పోలీసులకు వీక్ ఆఫ్ అమలు చేస్తామని, హోం గార్డులకు మెరుగైన జీతాలు ఇస్తామని ఆయన వెల్లడించారు.రోడ్ల పక్కన, ఫుట్పాత్లపైనా చిరు వ్యాపారం చేసుకుంటూ ఎందరో జీవిస్తున్నారని, అలాగే ఎందరో వృత్తిదారులు ఫుట్పాత్లను నమ్ముకుంటూ బతుకుతున్నారని  జగన్ తెలిపారు. వారంతా పెట్టుబడిగా రూ.1000, రూ.2 వేలను కూడా రూ.4 నుంచి రూ.5 వరకు వడ్డీతో తెచ్చుకుంటున్నారని ఆవేదన చెందారు. అందుకే వారి కష్టాలు తీరుస్తూ, చేయూతనిచ్చే విధంగా వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇస్తామని జననేత ప్రకటించారు. 


అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ రద్దు

కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ఉదయం శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పట్టణంలోని వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
అదోని నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉందని, పట్టణంలో నాలుగు రోజులకోసారి నీరిస్తున్నారని, ఇక గ్రామాల్లో వారానికోసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందని శ్రీ వైయస్ జగన్ తెలిపారు. 5 ఏళ్లుగా పరిస్థితి ఇదీ అని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.
ఇదే అదోనిలో గతంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ను మహానేత వైయస్సార్ కట్టాడని, అదే విధంగా అదోనిలో తీవ్ర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు చేపట్టి, మూడు బిట్లు పూర్తి చేయగా, మిగిలిన బిట్టును ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు.
అదోని రెవెన్యూ డివిజన్ అయినా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదని, ఉన్న ఒక ఎయిడెడ్ కళాశాలలో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో పిల్లలకు చదువు ఎండమావిలా మారిందని చెప్పారు.
ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో 14 మంది వైద్యులకు బదులు, కేవలం 5గురు మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు.
తుంగభద్ర లోలెవెల్ కాలువ ఆధునీకరణ కోసం రూ.175 కోట్లు కేటాయించిన మహానేత వైయస్సార్, అప్పట్లోనే రూ.75 కోట్ల పనులు పూర్తి చేయగా, ఆ మిగిలిన పనులను చంద్రబాబు చేపట్టలేదని చెప్పారు. దీంతో ఈ ఏడాది తుంగభద్రలో నీరున్నా రబీలో సాగు లేదని గుర్తు చేశారు. మైనారిటీలకు ఈద్గా సమస్య ఉందని, అయినా దాన్ని పరిష్కరించాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదని ఆక్షేపించారు.
తుంగభద్ర నదిపై గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మిస్తే, 2.65 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు, రెండు జిల్లాలలో 650 గ్రామాలకు మేలు జరుగుతుందని, ఇంకా లక్షల మందికి తాగు నీరివ్వొచ్చని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు ఆ ప్రాజెక్టును అస్సలు పట్టించుకోలేదని అన్నారు. 2014, ఆగస్టు 15న కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని ప్రకటించినా, ఈ 5 ఏళ్లు దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. 
కానీ, ఎన్నికలు రావడంతో గత నెల ఇక్కడికి వచ్చి ప్రాజెక్టు పనులకు టెంకాయ కొట్టాడని ఆక్షేపించారు.
చంద్రబాబు ప్రతి అడుగులో మోసం, దగా, వంచన కనిపిస్తాయని, సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడవడంలో ఎందుకు వెనుకాడుతాడని అన్నారు.
దేశంలోనే కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువని, కానీ గత 5 ఏళ్లుగా ఆ ఉల్లికి ధర రాక, పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారని చెప్పారు. ఇక్కడ కిలో ఉల్లికి కనీసం రూ.1.50 గిట్టుబాటు కాకున్నా, చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్లో కిలో ఉల్లి రూ.23 కి అమ్ముతున్నారని, ఆ విధంగా దళారుల దోపిడి సాగుతోందని తెలిపారు. దళారీలను కట్టడి చేయాల్సిన చంద్రబాబు స్వయంగా వారికి నాయకుడిగా మారారని ఆరోపించారు. ఉల్లి, టమోటాతో పాటు, పత్తి ధరలు కూడా అలాగే దారుణంగా ఉన్నాయని వివరించారు. .
వారితో పాటు, కుల వృత్తుల వారు, రోడ్డు పక్కనే ఉన్న కుమ్మరులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, చెప్పులు కుట్టుకునే వారు కావచ్చు.. అందరికి ఒకే మాట చెబుతున్నానని అన్నారు.
గుర్తింపు కార్డులు–రుణం
‘మీ సమస్యలు చూశాను. దగ్గర నుంచి విన్నాను. మీ అందరికీ నేను ఉన్నాను. అందుకే మీ అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాను. రోడ్డు పక్క చిరు వ్యాపారం చేసుకుంటున్న వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎలాంటి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం ఇస్తాము’ అని శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు.
దారి పొడవునా కష్టాలు, బాధలు వింటూ నడిచానని, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం చూస్తున్న వారిని చూశానని, నవరత్నాలు ద్వారా వారందరికీ మేలు చేస్తానని వెల్లడించారు.