చిన్నకోడూరు, మే 15 (way2newstv.com)
చిన్న కోడూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని డీఎస్ఓ వెంకటేశ్వర్లు బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రం లోని వసతుల గురించి రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. వడ్లు తక్కువగా వస్తున్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం సెంటర్ క్లోజ్ చేస్తే ఎలా ఉంటుందని రైతుల అభిప్రాయాలు అడిగారు.
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎస్ఓ
కాగా రైతులు చెరుకు పెద్దులు, మందపల్లి యాదయ్య మేమంతా దళారులను ఆశ్రయించ వలసి వస్తుంది కాబట్టి సెంటర్ ఉండాలని కోరారు. సెంటర్ నిర్వాహకులను బుక్స్ ఎలా రాస్తున్నారని బుక్స్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం పి ఎం మహిపాల్ , సి సి శ్రీనివాస్ రెడ్డి, బుక్ కీపర్ లక్ష్మి ,గ్రామ సంఘం అధ్యక్షురాలు పాల్గొన్నారు.