కాలేజీ బస్సు బోల్తా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాలేజీ బస్సు బోల్తా

ఖమ్మం, మే 13, (way2newstv.com)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని చెరువు మాధారం క్రాస్ రోడ్డు వద్ద కోదాడ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్  సైన్స్ కాలేజీ కి సంబంధించిన బస్సు బోల్తా పడింది. ఘటన సమయంలో బస్సులో 15 మంది విద్యార్ధులు  వున్నారు. ప్రమాదంలో  తేజస్విని, అనూష అనే విద్యార్ధినులకు  స్వల్ప గాయాలు తగిలాయి. .


కాలేజీ బస్సు బోల్తా

చెట్టు అడ్డు ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని బాధితులు అంటున్నారు.  వారిని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన పై కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం గా వ్యవరిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.