నాగబాబుకు కాపు కాయని జనసేన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నాగబాబుకు కాపు కాయని జనసేన


ఏలూరు, మే 24, (way2newstv.com)
కొణిదెల నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్‌కి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్‌కి అన్నగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. నరసాపురం రాజకీయాల్లో ‘జనసేన’ చక్రం తిప్పేందుకు 2019 ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో జనసేన ఏయే సీట్లు గెలవబోతుందని లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నాగబాబు పోటీ చేసిన నరసాపురంపైనే అందరి దృష్టి ఉంది. ఒకవైపు జనసేన ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్నా లేకపోయినా.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లడం ఖాయమే అని రాజకీయ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో నాగబాబు గెలుపు ఓటములపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జనసేన ఆశలు పెట్టుకున్న లోక్ సభ స్థానాలు నరసాపురం, అమలాపురం, వైజాగ్‌లు కాగా.. ఇంతకీ నాగబాబుకి గెలుపుపై బిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. జనసేనకు గంపగుత్తగా ఓట్లు పడతాయని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే.. అది కాపు సామజిక వర్గం నుంచే. నరసాపురం నియోజక వర్గానికి సంబంధించి దాదాపుగా 12 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా.. అందులో కాపు సామాజిక వర్గం ఓట్లు 3 లక్షల పైమాటే. 


నాగబాబుకు కాపు కాయని జనసేన

నరసాపురం సెగ్మెంట్స్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాలు.. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం నియోజక వర్గాల్లో కాపు సామజిక వర్గం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గాల్లో పవన్ సపోర్ట్ చేసిన టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే ఇప్పుడు జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగటంతో పాటు స్వయానా అధ్యక్షుడి అన్నయ్య నాగబాబు ఇక్కడ పోటీ చేస్తుండటంతో బలమైన కాపు సామాజిక వర్గం నాగబాబు విజయం కోసం గట్టిగానే నిలబడిందని లోకల్ లీడర్స్ నుండి వినిపిస్తున్న మాట.  కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ఓట్ల చీలికలకు దారితీసిందనే వాదన వినిపిస్తోంది. ఇక నరసాపురంలో క్షత్రియ ఓటింగ్ కూడా ఎక్కువగా ఉండటంతో టీడీపీ, వైసీపీలు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల్ని బరిలోకి 
దింపింది. వైసీపీ తరుపున రఘురామకృష్ణంరాజు బరిలో నిలవగా.. టీడీపీ తరుపున వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) బరిలో నిలిచారు. అయితే ఈ ఇద్దరూ క్షత్రియ కులస్థులు కావడంతో ఓట్లు చీలే అవకాశం ఉందని భావించారు. ఇది జనసేనకు కలిసి వస్తుందని భావించారు. కాకపోతే నరసాపురం ధన ప్రవాహం బాగా పనిచేసిందని ఇందులో వైసీపీ అభ్యర్ధి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని తెలుస్తోంది. మొత్తానికి కుల సమీకరణాలు, సినీ గ్లామర్‌తో నాగబాబు నరసాపురం ‘జనసేన’ జెండా ఎగరేస్తారా అంట నో చెప్పేశారు ఓటర్లు. ఇక నరసాపురం లోక్‌ సభ 
స్థానానికి 1957 నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరగగా.. ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, రెండుసార్లు బీజేపీ, ఒకసారి సీపీఐ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన గుణ్ణం గంగరాజు గెలుపొందారు.