ఏపీలో ఇంజనీరింగ్ ఫీజు 35 వేలే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో ఇంజనీరింగ్ ఫీజు 35 వేలే

విజయవాడ, జూలై 12(way2newstv.com)
ఇంజనీరింగ్‌ కాలేజీలకు కామన్‌ ఫీజు విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని 277 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు ట్యూషన్‌ ఫీజు ఒకే విధంగా ఉండేలా ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 2019-20 విద్యా సంవత్సరానికి గానూ అన్నీ కాలేజీలకు రూ.35 వేల ఫీజునే రీయింబర్స్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గతేడాది వరకు తెలంగాణలో మాదిరిగానే ఒక్కో రకమైన కాలేజీకి ఒక్కో రకమైన ఫీజు విధానం ప్రభుత్వం అవలంభించింది. 
ఏపీలో ఇంజనీరింగ్ ఫీజు 35 వేలే

ఈ క్రమంలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఫీజుల ఖరారు విషయమై ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ మేరకు నివేధిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.అన్నీ కాలేజీలకు ఒకే ఫీజు విధానం వర్తించేలా.. సీఎం జగన్ సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును 15-16 తేదీల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి చట్టబద్ధత రాగానే కమిషన్‌ కార్యాచరణ ప్రారంభిస్తుంది.ప్రస్తుతానికి రూ.35 వేల ఫీజును రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్టు మంత్రి సురేష్‌ వివరించారు. అయితే, ‘ఫెయిర్‌ ఫీజు’నే ఫైనల్‌గా అమలు చేస్తామని, రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే ఆ మొత్తాన్ని కూడా రీయింబర్స్‌ చేస్తామని మంత్రి సురేష్ అన్నారు. ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఈ విద్యా ఏడాదే ఇంజనీరింగ్‌కు ఫీజును నిర్ధారిస్తుందని తెలిపారు. ఫీజులు ఖరారు కాగానే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు