కేసీఆర్ దూరదృష్టి వల్ల తెలంగాణ ఎన్నో అవరోధాలను అధిగమించింది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ దూరదృష్టి వల్ల తెలంగాణ ఎన్నో అవరోధాలను అధిగమించింది

హైదరాబాద్, జూలై 13 (way2newstv.com): 
ముఖ్యమంత్రి కేసీఆర్  దూరదృష్టి మూలంగా తెలంగాణ ఎన్నో అవరోధాలను అధిగమించిందని,ఎన్నో  సవాళ్లను ఎదుర్కోగలిగామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాబార్ఢు 38 వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థ బలోపేతం చేయడంకోసం అనేక చర్యలు చేపట్టాంమన్నారు.- 60 శాతం జనాభా ఉన్న, వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామీణ ప్రాంతాలు నిలదొక్కుకోవాలన్నదే లక్ష్యంగా భావించామని చెప్పారు.మిషన్ కాకతీయతో 46 వేల చెరువుల పునరుద్దరణతో చెరువుల పరిధిలోని వ్యవసాయ ఆధారిత ప్రజలకు 78 శాతం ఆదాయం అదనంగా పెరిగిందన్నారు. చెరువులలో ఉచితంగా చేపపిల్లలు విడుదల చేయడం మూలంగా మత్య్సకారుల ఆదాయం 35 శాతం పెరిగిందని,-  265 టీఎంసీల నీటి నిలువ సామర్ధ్యాన్ని చెరువుల ద్వారా పునరుద్దురించుకున్నామన్నారు. 
కేసీఆర్ దూరదృష్టి వల్ల తెలంగాణ ఎన్నో అవరోధాలను అధిగమించింది

మిషన్ భగీరధతో రూ.43,791 కోట్ల వ్యయంతో 2.32 కోట్ల జనాభా ఉన్న 20.60 లక్షల ఆవాసాలకు శుద్దజలం తాగునీరు అందించే పథకాన్ని మొదలుపెట్టి పూర్తి చేశాంమన్నారు.- రాష్ట్రంలోని 58.33 లక్షల రైతులకు 1.43 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని- వీరందరికీ రైతుబంధు పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏడాదికి రెండు సార్లు వారికి పంట పెట్టుబడి కింద ప్రభుత్వ సాయం అందుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తనకేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు- ప్రతిష్టాత్మక ఇస్టా 32వ సదస్సు తొలిసారి ఆసియాలో అదీ తెలంగాణలో నిర్వహించుకోవడం జరిగిందని, ఈ సదస్సు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు.- ప్రపంచంలోనే ఎత్తయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఓ ఇంజనీరింగ్ అద్భుతమన్నారు.- రూ.80 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో కేవలం మూడేళ్లలో పూర్తయింది-  ప్రపంచంలోనే ఎవరూ చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుభీమా పథకం చేపట్టారన్నారు.- ప్రభుత్వమే భీమా చెల్లించి మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వడం ఆ కుటుంబాలకు గొప్ప ఊరట అని అన్నారు.- రైతులు, ప్రభుత్వం, బ్యాంకులను అనుసంధానం చేసే సంస్థ నాబార్డు- వ్యవసాయ రంగానికి నాబార్డు సేవలు ప్రశంసనీయమన్నారు.రైతులకు రుణాలిచ్చి అండగా నిలవబడుతుందని, మిషన్ భగీరధకు రూ.4800 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ఇచ్చినందుకు మంత్రి నాబార్డుకు ధన్యవాదాలు తెలిపారు.- తెలంగాణ సంక్షేమ, అభివృద్ది పథకాలకు నాబార్డు అందిస్తున్న సాయం మరవలేనిందన్నారు.భవిష్యత్ లో ఈ సహకారాన్ని 
కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రంలో  ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ ఫకీర్ సామి, రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, నాబార్డ్ ఫార్మర్ చైర్మన్ కోటయ్య, ఏపీ నాబార్డ్ సీజీఎం సెల్వరాజ్, నాబార్డ్ తెలంగాణ సీజీఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు