హైదరాబద్ జూలై 6 (way2newstv.com):
ఒక మహిళ దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టడం గర్వకారణమని మాజీ ఎంపీ కవిత అన్నారు. పలు పథకాలపై కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రశంసలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ మేరకు కవిత ట్విటర్లో స్పందించారు. కేంద్రం నుంచి ప్రశంసలు వస్తున్నాయని కానీ, నిధులు మాత్రం రావడం లేదని ట్విటర్లో పోస్టు చేశారు. రాష్ట్రానికి రావాల్సినవి కూడా దక్కకపోవడం బాధాకరమన్నారు.
ఒక మహిళ దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టడం గర్వకారణం: కవిత