జగన్ పై లోకేష్ సెటైర్లు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ పై లోకేష్ సెటైర్లు...

విజయవాడ, జూలై 19, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని టార్గెట్ చేశారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైసీపీ 50 రోజుల పాలనలో లోటుపాట్లపై రోజుకో అంశంపై ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. తాజాగా లోకేష్ ఆశా వర్కర్ల జీతాలు, రైతుల ఆత్మహత్యల అంశంపై జగన్‌ను టార్గెట్ చేశారు. అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఇక ప్రజా ఉద్యమాలు చేస్తామంటూ హెచ్చరించారు. ట్వీట్‌లో ‘జగన్ మాయా ప్రభుత్వం.. రైతుల పేరుతో జగన్ గారు.. వికృత రాజకీయం మొదలుపెట్టి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు. బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ, అందులో 391 మందివి మాత్రమే రైతుల ఆత్మహత్యలు అని తేల్చారు. 
 జగన్ పై లోకేష్ సెటైర్లు...

అదే అసెంబ్లీ సమావేశాల్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 1160 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ, అందులో 454 మందివి రైతుల ఆత్మహత్యలని చెప్పారు. టిడిపి హయాంలో రైతుల ఆత్మహత్యలు అంటూ దొంగలెక్కలు మాని మీ నాన్నగారి హయాంలో చనిపోయిన 15 వేలమంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థన’అన్నారు లోకేష్. రైతుల పేరుతో జగన్‌  గారు వికృత రాజకీయం మొదలుపెట్టి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు.  బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ,  అందులో 391 మందివి మాత్రమే  రైతుల ఆత్మహత్యలు అని తేల్చారు.అంతకు ముందు ఆశా వర్కర్ల సమస్యలు, జీతాలపై లోకేష్ ట్వీట్లు చేశారు. ‘దొంగబ్బాయ్ తొలి సంతకమే దొంగ సంతకం అని తేలిపోయింది. రూ.10 వేలు జీతం పెంచేస్తున్నాం అని ఆశా వర్కర్లని ఆశపెట్టి దగా చేసారు. తూచ్! మేము ఆ హామీ ఇవ్వలేదు పెంచేది రూ.1400లే అని మంత్రి అసెంబ్లీ సాక్షిగా తేల్చారు. ఇలా ఒక్కో రత్నం రాలిపోతే, మీ ఇంటి దగ్గర 144 సెక్షన్ కొనసాగించాల్సి వస్తుంది. ఆశావర్కర్లకి ఇచ్చిన హామీ మేరకు జీతం పెంచే వరకూ మేము ఉద్యమిస్తాం’అంటూ టార్గెట్ చేశారు.