హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

విజయవాడ, జూలై 11(way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీ జరుగుతున్న చర్చ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎంతసేపైనా మాట్లాడేందుకు మైక్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం సభలో నోరు నొక్కేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. 
హాట్‌హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతను చూసి సంతోషించాల్సింది పోయి ఆరోనణలు చేస్తారా? అని నిలదీశారు.దీనిపై స్పందించిన చంద్రబాబు... ఏపీ ప్రభుత్వం ఏకపక్షనిర్ణయాలతో భవిష్యత్ తరాలను నాశనం చేస్తోందని ఆరోపించారు. జగన్ వయస్సు తన రాజకీయ అనుభవమంత కూడా లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీళ్లివ్వకపోతే రాష్ట్ర పరిస్థితి ఏంటో జగన్ తెలుసుకోవాలన్నారు. ఆ తర్వాత టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌తో పాఠాలు చెప్పించుకునే దౌర్భాగ్య పరిస్థితి తమకు వచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్ని నదులున్నాయో, ఎన్ని ప్రాజెక్టులున్నాయో తమకు తెలుసని, జగన్‌తో చెప్పించుకునే స్థితిలో తాము లేమన్నారు. ఏపీకి చెందిన కీలక విషయాలన్నీ జగన్ తెలంగాణకు దోచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ నవ్వుతూ కనిపించారు. ఆయన ప్రభుత్వంపై ఆగ్రహంతో విరుచుకుపడున్నా పట్టించుకోకుండా తన సీట్లో పడిపడి నవ్వారు. దీన్ని బట్టి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను జగన్ సీరియస్‌గా తీసుకోలేనట్లుగా కనిపిస్తోంది.