జగన్ ప్రమాణ స్వీకారానికి తిరిగిన ప్రయాణాల సంగతేంటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ ప్రమాణ స్వీకారానికి తిరిగిన ప్రయాణాల సంగతేంటీ

విజయవాడ, జూలై 15 (way2newstv.com)
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గౌతమ్రెడ్డి సమాధానం ఇచ్చారు. చంద్రబాబు విదేశీ పర్యటనలకు రూ.39 కోట్లు ఖర్చైనట్లు తెలిపారు.. దీంతో వైసీపీ టీడీపీని టార్గెట్ చేసింది. విదేశీ పర్యటనలతో పేరుతో దుబారా ఖర్చు చేశారని.. ఆ టూర్లతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. వైసీపీ విమర్శలపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. 
జగన్ ప్రమాణ స్వీకారానికి తిరిగిన ప్రయాణాల సంగతేంటీ

అసెంబ్లీ లాబీల్లో చిట్చాట్గా మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక విమానాల్లో తిరిగితే.. జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే ప్రత్యేక విమానాల్లో తిరిగారన్నారు. పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు వెళుతుంటారని.. వీటిని దుబారా ఖర్చుగా భావించడం సరికాదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసీపీ అనవసరంగా రాద్దాంతం చేస్తోందని. ఆ పర్యటనల వల్లే గత ఐదేళ్లలో 5 లక్ష ఉద్యోగాలు వచ్చాయని.. ప్రభుత్వమే ఒప్పుకుందున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక గోదావరి జలాల తరలింపును ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందని.. తెలంగాణ భూభాగం నుంచి నీటి తరలింపు ఆలోచనే ప్రమాదకరమన్నారు. భవిష్యత్లో ఆ ప్రభుత్వాల దయపై నీటి విడుదల ఉంటుందని గుర్తు పెట్టుకోవాలన్నారు.