వున్న చోటే రాజధాని వుండాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వున్న చోటే రాజధాని వుండాలి

విజయవాడ, ఆగస్టు 29, (way2newstv.com)
శ్రీబాగ్ ఒడంబడికలో ఒక ప్రాంతంలో హై కోర్టు, మరో ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని 1937 లో నే ఒప్పందం జరిగింది. ఇప్పుడు నవ్యాంధ్రలో రాజధాని అమరవతిలోనే ఉండాలి,ఉండాలని అసెంబ్లీ ఆమోదం లభించింది. సాక్ష్యాత్తు ప్రధాని శంకుస్థాపన చేశారు,నిధులు వెచ్చించారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు.  ఇప్పటికే చాలా వరకు భవనాలు పూర్తయ్యాయి,అవి తాత్కాలికమో, శాశ్వతమో ఏదైనా నిర్మాణాలు జరిగాయి. 
వున్న చోటే రాజధాని వుండాలి

ఆ భవనాల్లోనే ముఖ్యమంత్రి కూర్చుని పరిపాలన చేస్తున్నారు. ఎన్జీవో,మంత్రులు,ఎమ్మెల్యేలు,కాల్ 4 ఉద్యోగుల , నివాసాలు, న్యాయమూర్తుల నివాసాలు పూర్తి కావచ్చాయి, ఇప్పటికే అన్ని 80శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్న భవనాలు రాజధానికి సరిపోతాయి,ఇప్పుడు ప్రభుత్వం కాస్త వెచ్చిస్తే మిగతావి పూర్తైపోతాయి. ఇటువంటి సందర్భంలో వేరే ఆలోచన ఎందుకు ? ఇప్పుడు ఉన్న చోటే రాజధానిని పూర్తి చేయాలి. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినట్టు నిర్మాణాలకు అధిక వ్యయం అన్న మాటలో వాస్తవం లేదు.  ఇప్పుడు నెలకొన్న పరిస్థితి వలన పెట్టుబడిదారులు వెనక్కి పోతున్నారు. ఆదాయం ఇప్పటికే మందగించింది,కాబట్టి ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి. అధికార వికేంద్రీకరణ లో భాగంగా,శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం హై కోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని అన్నారు. అమరావతి ,విశాఖలో హై కోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలి ,జగన్ రాజకీయ కక్ష పక్కన పెట్టి ఆ దిశగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని తులసి రెడ్డి అన్నారు.