న్యూఢిల్లీ ఆగష్టు 16 (way2newstv.com)
కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్టు సమాచారం. కొద్దికాలం నుంచి అనారోగ్యంగా ఉన్న ఆయన గత వారం రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇవాళ ఆయనను పరామర్శించేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎయిమ్స్కు వెళ్లనున్నారు.
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం..
66ఏళ్ల అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలను నిర్వహించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో... 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీచేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం జైట్లీ అమెరికా వెళ్లడంతో.. ఆయన బదులు పియూష్ గోయల్మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. తాను ఎలాంటి పదవులూ స్వీకరించలేనంటూ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు.
Tags:
all india news