3 వేల కోట్లు దాటిన రిజిస్ట్రేషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

3 వేల కోట్లు దాటిన రిజిస్ట్రేషన్

హైద్రాబాద్, సెప్టెంబర్ 27, (way2newstv.com)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు ముగియక ముందే రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.3 వేల కోట్లు దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ఆరు నెలల్లో రూ.2 వేల కోట్ల లోపు ఆదాయానికే పరిమితమైన రిజి్రస్టేషన్ల ఆదాయం ఈ ఏడాది ఆల్‌టైమ్‌ హై రికార్డుతో రూ.3,118 కోట్లకు చేరింది. ఆరు నెలలు ముగిసేందుకు మరో వారం రోజుల గడువు మిగిలి ఉండగానే ఈ రికార్డు సాధించడం గమనార్హం. 
3 వేల కోట్లు దాటిన రిజిస్ట్రేషన్

ముఖ్యంగా సెపె్టంబర్‌ మాసం దుమ్మురేపుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఆదాయం రూ.398 కోట్లు దాటిపోయింది. ఈ నెల 13కి రాష్ట్ర మొత్తం ఆదాయం రూ.2,951 కోట్ల పైచిలుకు ఉండగా, 25కి అది రూ.3,118 కోట్లకు చేరింది.మొత్తం 12 రోజుల్లో  సెలవులు పోను 9 రోజుల్లోనే రూ.167 కోట్ల ఆదాయం వచి్చంది. సగటున రోజుకు రూ.20 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా, 5 వేలకు పైగా డాక్యుమెంట్లు రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రిజి్రస్టేషన్‌ జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రం మొత్తం ఆదాయంలో సగం రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచే వస్తోంది. యాదాద్రి జిల్లాలోనూ ఈ ఏడాది ఇప్పటివరకు రూ.70 కోట్లకు పైగా ఆదాయం వచి్చంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం తక్కువ ఉన్న జిల్లాల్లో కొమురం భీం, జయశంకర్, భద్రాద్రి జిల్లాలున్నాయి.