ఆకట్టుకుంటున్న పోస్టల్ బ్యాంకులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆకట్టుకుంటున్న పోస్టల్ బ్యాంకులు

ఏలూరు, సెప్టెంబర్ 13, (way2newstv.com)
దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఈ విధానంలో తొలుత జిల్లాలోని ఏలూరు, భీమవరం డివిజన్లలో ఈ సేవలు ఆకట్టుకుంటున్నాయి.బ్యాంకు వ్యక్తిగత ఖాతాలో నగదు తీయాలన్నా, వేయాలన్నా ఆవివరాలు రాసిన ఓచర్‌ బ్యాంకులో అందజేయడం తప్పనిసరి. దీంతో ఆ అవసరం లేని సేవలు తపాలాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐపీపీబీ పేరుతో సెప్టెంబరు 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సేవల ముఖ్య ఉద్దేశం వృద్ధులు, విద్యార్థులు, గృహిణులు, పట్టణాలకు వచ్చే వలసదారులు, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చడమేననితపాలాశాఖ అధికారులు చెబుతున్నారు. తపాలా బ్యాంకులకు రాలేని వారు మొబైల్‌ నుంచి మెసేజ్‌ పంపినా, మిస్డ్‌ కాల్‌ చేసినా రూ.10 వేలకు మించని లావాదేవీలు నేరుగా ఇంటికే వెళ్లి అందజేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతి ఖాతాదారుడికి ఒక క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌) ఉన్న డెబిట్‌ కార్డును అందజేస్తారు.
ఆకట్టుకుంటున్న పోస్టల్ బ్యాంకులు

దీని ద్వారా ప్రస్తుతం మార్కెట్‌లో వినియోగంలో ఉన్న పేటీఎంమాదిరిగా విద్యుత్‌ బిల్లులు, పెట్రోలు కొనుగోళ్లు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌లో చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్‌ నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని సైతం వినియోగించుకునేవెసులుబాటు ఉంది కేవలం ఆధార్‌కార్డు ఆధారంగా పొదుపు ఖాతాను జీరో బ్యాలెన్స్‌తో తెరుచుకునే వెసులుబాటు కల్పించారు. వ్యాపారులు, సంస్థలకు అవసరమైన కరెంట్‌ ఖాతాలను సైతం పొందవచ్చు.  తపాలా కార్యాలయాలు.. ఒకప్పుడు సమాచార వ్యవస్థలో కీలకం. కొరియర్లు, మొబైల్‌ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో తపాలాశాఖ వెనుకబడింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలోపరుగెత్తలేక చేతులెత్తేయడంతో తపాలాశాఖ పేరు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. తమ మనుగడ కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకులతో పోటీ పడేందుకు సిద్ధమైంది.బ్యాంకులకు సవాలు విసిరేలా తపాలాశాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బ్యాంకుల తరహాలో ఏటీఎం కార్డులు, నగదు జమ, డిపాజిట్‌ వంటి సేవలను అందిస్తుండగా తాజాగా మరో అడుగు ముందుకువేసి బ్యాంకుల మాదిరిగా తమ ఖాతాదారులను సైతం అన్నిరకాల చెల్లింపులు చేసుకునేలా కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ)ద్వారా జీరో ఎక్కౌంట్‌లను తెరవడమే కాకుండా అన్నిరకాల చెల్లింపులు, ఇతర సేవలకు నామమాత్రపు రుసుములతో అందుబాటులోకి తీసుకువచ్చారు.  అన్నిరకాల చెల్లింపులు, నగదు బదిలీలు,అన్నిరకాల బిల్లులు, వినియోగ ఛార్జీలు, వ్యాపార లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదే సందర్భంలో ఖాతాలో రూ. లక్షకు మించి నిల్వ ఉండటానికి వీలుండదు. లావాదేవీల చెల్లింపులకుపొదుపు ఖాతాదారుల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయరు. బ్యాంకులకు రాలేని స్థితిలో ఉన్నప్పటికీ, తీరిక లేకున్నా ఖాతాదారుని ఇంటివద్దకు వచ్చి మరీ సేవలు అందించడం విశేషం. ఇలాంటిసందర్భాల్లో మాత్రం పరిమితంగానే ఛార్జీలు వసూలు చేస్తారు.