ఢిల్లీలో కనీస వేతనం రూ.15 వేలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఢిల్లీలో కనీస వేతనం రూ.15 వేలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 29, (way2newstv.com)
సుప్రీం కోర్టు ఇటీవల మద్దతు తెలిపిన కనీస వేతన పెంపు నిర్ణయాన్ని నోటిఫై చేసింది ఢిల్లీ ప్రభుత్వం. దీంతో ఏకంగా 55 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. అన్‌స్కిల్‌డ్ వర్కర్లకు ఇప్పుడు కనీసం వేతనం నెలకు రూ.14,842గా ఉంది. ఇది వరకు వీరికి రూ.14,000 జీతం ఉండేది.అలాగే సెమీ స్కిల్‌డ్ వర్కర్లకు ఇప్పుడు రూ.15,400 కాకుండా రూ.16,341 కనీస జీతం లభిస్తుంది.అలాగే స్కిల్‌డ్ వర్కర్లకు జీతం రూ.16,962 నుంచి రూ.17,991కు పెంచారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా జీతం 11 శాతం మేర పెరగనుంది.
ఢిల్లీలో కనీస వేతనం రూ.15 వేలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు అలాగే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) కూడా లభిస్తుందని తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి డీఏ వస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒక నెల జీతం దీపావళి బోనస్ కింద అందజేస్తామని తెలిపారు. నగరంలో మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, పేదరికాన్ని అధిగమించేందుకు ఇది చాలా కీలకమైన నిర్ణయమని పేర్కొన్నారు.ఆర్థికంగా వెనుకబడిన వారు నాణ్యమైన జీవితం గడిపేందుకు కనీస వేతన పెంపు నిర్ణయం అమలు దోహదపడుతుందని ఆయన తెలిపారు. చేతిలోకి ఎక్కువ డబ్బులు రావడం వల్ల వర్కర్లు కూడా ఎక్కువగానే ఖర్చు చేస్తారని, అప్పుడు మార్కెట్‌లో ఉత్పత్తి పెరుగుతుందని, దీంతో ఉద్యోగ కల్పన మ మెరుగు పడుతుందని, తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వివరించారు.ఇకపోతో 2019 అక్టోబర్ 9న కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 5 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూలై 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.